Saturday, September 21, 2024

CSK vs PBKS | తడబడిన చెన్నై.. పంజాబ్ ముందు ఈజీ టార్గెట్

ఐపీఎల్ 2024లో నేడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు త‌డ‌బ‌డింది. హోం గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు ఆశించన మేర రాణించలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది.

టాస్ ఓడిన చెన్నైకి ఓపెన‌ర్లు శుభారంభ‌మిచ్చారు. మొదట ధాటిగా ఆడిన సీఎస్‌కే ఒక‌ద‌శ‌లో 6 ఓవ‌ర్ల‌కే 55 కొట్టింది.. ఆ తరువాత పంజాబ్ బౌలర్లు చెలరేగడంతో చెన్నై బ్యాటింగ్ లైనప్ కంగుతింది. అయితే చెన్నై కెప్టెన్ రుతురాజ్ నిలకడగా ఆడుతూ.. (62) అర్థ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అజింక్యా ర‌హానే(29), సమీర్ రిజ్వీ ( 21), మొయిన్ అలీ (15), ఎంస్‌ ధోని (14) పరుగులకు వెనుదిరిగారు.

ఇక పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ రెండేసి వికెట్లు తీయగా.. కగిసో రబడ, అర్ష్దీప్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement