Sunday, September 8, 2024

దేశంలో త‌గ్గుతున్న క‌రోనా.. కొత్తగా కేసులు ఎన్నంటే..?

దేశంలో కొత్తగా 5379 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,72,241కి చేరాయి. ఇందులో 4,38,93,590 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,28,057 మంది మరణించగా, 50,594 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 7094 మంది కోలుకోగా, 16 మంది మరణించారు. కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.70 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 213.91 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement