Saturday, September 14, 2024

మొక్క‌జొన్న పొత్తుల కోసం బేర‌మాడిన కేంద్రమంత్రి-మండిప‌డిన నెటిజ‌న్స్

ఓ మంత్రి కారులో వెళ్తూ మొక్క‌జొన్న పొత్తుల బండిని చూశారు. ఆయ‌న‌కి తినాల‌నిపించి కారుదిగి బండివ‌ద్ద‌కు వెళ్లి మూడు పొత్తులను కాల్పించుకుని, ఉప్పు రాయించుకున్నారు కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే.
ఒక్కోటీ ఎంత అని అడిగారు. దానికి రూ.15 అంటూ విక్రయదారు నుంచి సమాధానం వచ్చింది. మూడు కంకులకు రూ.45 రూపాయలు.. ఇంత అధిక ధరకు విక్రయిస్తావా అని ప్రశ్నించారు.

దానికి దుకాణాదారు స్పందిస్తూ. రూ.15 అన్నది స్టాండర్డ్ ధర. మీకు కారు ఉందని చెప్పి ధరను పెంచలేద‌ని బదులిచ్చాడు. మొక్కజొన్న ఇక్కడ ఉచితంగా లభిస్తుందని తెలుసా అని మంత్రి కులస్తే ప్రశ్నించారు. ఎన్నో ప్రశ్నల తర్వాత ఆ మొత్తం చెల్లించి వచ్చేశారు. సియోని నుంచి మండ్లకు వెళుతున్నాను. స్థానిక మొక్కజొన్నను రుచి చూశాను. స్థానిక రైతుల నుంచి, స్థానిక వ్యాపారుల నుంచే అన్ని ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఇది వారికి ఉపాధి కల్పిస్తుంది’’ అని మంత్రి ట్వీట్ చేశారు. కానీ మొక్క జొన్న కోసం మంత్రి బేరాలాడిన తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు. మంత్రికి పెరిగిన ధరల మంట తెలిసొచ్చిందన్న కామెంట్లు కూడా వినిపించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement