Friday, October 18, 2024

Kerala | వయనాడ్ బ‌రిలో ప్రియాంక గాంధీ..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నున్నారు. కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్ర‌క‌టించింది. దీంతో వయ‌నాడ్ నుంచి కాంగ్రెస్ త‌రుఫున‌ ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. అయితే, ఎన్నికల బరిలోకి ప్రియాంక‌ దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయబరేలీ నుంచి భారీ విజయంతో గెలుపొందారు. అయితే వయనాడ్ వదులుకుని రాయబరేలీలో కొనసాగుతున్నారు. దీంతో వయవాడ్ బైపోల్ కు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇక‌ నవంబర్ 13న పోలింగ్ జరగ‌నుండ‌గా.. అదే నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement