Saturday, September 21, 2024

TG | రేపు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి కాంగ్రెస్ పిలుపు

తెలంగాణ కాంగ్రెస్ రేపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని టీపీసీసీ తెలిపింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ అనుచితంగా మాట్లాడారన్నారు. మహిళలను కించపరుస్తూ బస్సుల్లో బ్రేక్ డ్యాన్స్ లు, రికార్డింగ్ డ్యాన్సులు అంటూ కేటీఆర్ చాలా అవహేళనగా మాట్లాడారు.

తెలంగాణ మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరికి నిరసనగా రేపు (శుక్రవారం) అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండలాల్లో కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు టీపీసీసీ పిలుపునిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. మహిళా లోకానికి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement