Monday, September 16, 2024

Congress | పలు రాష్ట్రాలకు కార్యదర్శుల నియామ‌కం..

కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాలకు ఏఐసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను నియమిస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ కాంగ్రెస్ సెక్రెటరీగా విశ్వనాథన్, పీసీ విష్ణునాథ్‌ను నియమించింది. ఏపీ సెక్రటరీగా గణేష్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీగా పాలక్ వర్మ పేర్లను పార్టీ ప్రకటించింది. దీంతో పాటు ఛత్తీస్ గఢ్, తమిళనాడు, గుజరాత్ కి సైతం కార్యదర్శులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఛత్తీస్గఢ్ – కాంగ్రెస్ సెక్రటరీగా సంపత్ కుమార్, తమిళనాడు – పుదుచ్చేరి కార్యదర్శిగా సూరజ్ హెగ్గేల‌ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. గుజరాత్ – ఏఐసీసీ సెక్రటరీగా ఉషానాయుడు, జార్ఖండ్ కాంగ్రెస్ సెక్రటరీగా సిరివెల్ల ప్రసాద్ నియామకం అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దీపదాస్ మున్షీకి ఇంచార్జి కార్యదర్శులు సహాయకులుగా వ్యవహరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement