Tuesday, July 2, 2024

Congratulation – రోహిత్ , కోహ్లీ, ద్ర‌విడ్ ల‌కు ప్ర‌ధాని మోదీ ఫోన్

రోహిత్ సేనకు అభినందనలు
వ‌త్తిడిలో కూడా అద్భుతంగా ఆడావ్ అంటూ కోహ్లీకి ప్ర‌శంస‌
ఈ విజ‌యాల వెనుక మీ కృషి ఆమోఘం అంటూ ద్ర‌విడ్ కు గ్రీటింగ్స్

తిరుగులేని ఆటతీరుతో టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న టీమిండియాపై అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్ర‌విడ్ , కింగ్ కోహ్లీల‌ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “ప్రియమైన రోహిత్ శర్మ… అద్భుతమైన వ్యక్తిత్వం నీ సొంతం. నీ దూకుడు మనస్తత్వం, ధాటియైన బ్యాటింగ్, చురుకైన కెప్టెన్సీ భారత జట్టుకు కొత్త కోణాన్ని జోడించాయి. నీ టీ20 కెరీర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇవాళ ఉదయం నీతో మాట్లాడినందుకు ఎంతో ఆనందంగా ఉంది” అంటూ రోహిత్ తో ఫోన్ లో తానేం మాట్లాడారో ప్రధాని వెల్లడించారు.

ఇక కింగ్ కోహ్లీని ప్ర‌త్యేకంగా అభినందిస్తూ, కీల‌క స‌మ‌యంలో వ‌త్తిడిని జ‌యించి ఆడి ప‌రుగుల చేసిన తీరు అద్భుతం అంంటూ ప్ర‌శంసించారు

ఇక ద్ర‌విడ్ తో మాట్లాడుతూ, మీ శిక్ష‌ణ‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మై టి 20 20 వ‌ర‌ల్డ్ క‌ప సాధించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు.. మీ శిక్ష‌ణ‌లో రాటుదేలిన టీమ్ ఇండియా విజ‌యాల వెనుక మీ కృషి మ‌ర‌వ‌లేనిద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు మోదీ

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement