Tuesday, September 17, 2024

Congrats – మ‌ను బాక‌ర్ కు తెలంగాణ‌, ఎపి సిఎంల అభినంద‌న‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ అమ‌రావ‌తి – పారిస్ ఒలింపిక్స్ లో షూట‌ర్ మను బాకర్ నేడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో సరబ్ జోత్ సింగ్ తో కలిసి మరో కాంస్యం కైవసం చేసుకుంది. తద్వారా 124 ఏళ్ల తర్వాత ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన భారత మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. దీంతో తెలంగాణ‌,ఎపి ముఖ్య‌మంత్రులు రేవంత్ రెడ్డి, చంద్ర‌బాబులు ఆమెకు ఎక్స్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు..


భారత్‌ తరపున మరో పతకం సాధించిన అథ్లెట్స్ మనుబాకర్‌ – సరబ్‌జోత్ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన విజ‌యం మ‌రెంద‌రికో స్పూర్తి ఇస్తుంద‌ని అన్నారు.

మను బాకర్ సంధించిన షాట్ చారిత్రాత్మకం అని అభినందించారు చంద్ర‌బాబు . 124 ఏళ్ల తర్వాత ఓ భారత క్రీడాకారిణి ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించడం అపురూపం అని కొనియాడారు. ఈ సందర్భంగా మను బాకర్ కు, సరబ్ జోత్ సింగ్ కు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నానని చంద్రబాబు వెల్లడించారు. భారత షూటర్ల ప్రదర్శన పట్ల గర్విస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement