Wednesday, October 9, 2024

T20 WC | కీల‌క మ్యాచ్ లో కంబ్యాక్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్ !

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భార‌త టాపార్డ‌ర్ కంబ్యాక్ ఇచ్చింది. శ్రీలంకతో జ‌రుగుత‌న్న కీల‌క మ్యాచ్ లో ఓపెన‌ర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన, కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ చెల‌రేగిపోయారు. దాంతో భార‌త జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 172/3 ప‌రుగులు సాధించింది.

కెప్టెన్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్ *52 నాటౌట్), వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (38 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్ *50) అర్థ శ‌త‌కాల‌తో విజృంభించారు. ఇక ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ (43) ప‌రుగుల‌తో రాణించింది. దాంతో భారత స్కోర్ భారీగా వెల్లింది.

శ్రీలంక బౌలర్ల‌లో చమరి అథాపత్తు, అమ కాంచన త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. కాగా, శ్రీలంక జ‌ట్టు 173 ప‌రుగుల భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement