Wednesday, October 2, 2024

Cocaine Seized: ఢిల్లీలో రూ.2వేలకోట్ల విలువైన కొకైన్‌ సీజ్‌..!

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లింగ్‌ ముఠా గుట్టు రట్టయ్యింది. 500కిలోల కొకైన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ విలువ రూ.2వేలకోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీస్‌ స్పెషల్‌ సెల్ బృందం ద‌క్షిణ‌ ఢిల్లీలో సోదాలు చేప‌ట్టింది.

ఈ త‌నిఖీల్లో నలుగురు వ్యక్తులను నుంచి 560 కిలోలకుపైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో ఈ మాద‌క ద్ర‌వ్యాల విలువ రూ.2వేలకోట్లకు పైగా ఉంటుందని పోలీసులు వెల్ల‌డించారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.

- Advertisement -

కాగా, ఇటీవల ఢిల్లీ పోలీసులు ఇద్దరు ఆఫ్ఘనిస్థాన్ పౌరుల‌ను అదుపులోకి తీసుకుని వారి వ‌ద్ద‌ నుంచి 400 గ్రాముల హెరాయిన్‌, 160 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. వారిద్ద‌రిని విచారించగా.. భారీగా డ్ర‌గ్స్ దందా న‌డిపిస్తున్న ఈ అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టయ్యింద‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement