Tuesday, September 17, 2024

TG | రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వాడ వాడలా వెలిసే గణేష్‌ మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలని సీఎం అన్నారు. ఈ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఏడాది వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందిస్తుందని సీఎం ఇప్పటికే ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement