Friday, October 18, 2024

Alai Balai | మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్.. : దత్తాత్రేయ

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆదివారం అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. అలమ్ బ‌లైబ్ కార్య‌క్ర‌మానికి త‌ప్పకుండా వ‌స్తానని చెప్పిన‌ సీఎం రేవంత్ రెడ్డి….. మాట నిలబెట్టుకున్నారని అన్నారు.

రేవంత్ ఆత్మ విశ్వాసంతో ఎదిగిన వ్యక్తి అని… జడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగారని కొనియాడారు. అలయ్ బలయ్ కి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. అలయ్ బలాయ్ కి రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు పరస్పర అవగాహనతో పని చేయాలని సూచించారు.

అన్ని రంగాల్లో ముందుండాలని, ఐక్యంగా ఉంటూ ముందుకు సాగాలన్నారు. నేను హర్యానాకి గవర్నర్ అయిన‌ప్ప‌టికీ… తెలంగాణ బిడ్డనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో హస్తకళలను ప్రదర్శించామని, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

కాగా, ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు హరిబాబు, విజయశంకర్, గుర్మిత్ సింగ్, వివిధ పార్టీల కీలక నేతలు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement