Sunday, September 15, 2024

Delhi | ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోస్ అవెన్యూ కోర్టు ఇటీవలే సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.1 లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.

తాజాగా ఢిల్లీ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా రేపు (సోమవారం) విచారించాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు రిజిస్ట్రీని అభ్యర్థించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement