Thursday, September 19, 2024

Delhi | ఏచూరి నివాసానికి సీఎం చంద్రబాబు..

సీఎం చంద్రబాబు ఈరోజు (శుక్రవారం) సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. కాగా, చంద్రబాబు నేరుగా విమానాశ్రయం నుంచి సీతారాం ఏచూరి నివాసానికి బయలుదేరారు. ఏచూరి పార్ధివదేహానికి సీఎం నివాళులర్పిస్తారు.

ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి సీతారాం ఏచూరి మృతదేహాన్ని ఇవాళ సాయంత్రం జేఎన్‌యూకు తీసుకువెళ్లారు. అక్కడ ఏచూరి భౌతికకాయానికి అధ్యాపకులు, విద్యార్థులు నివాళి అర్పించారు. ఇక‌, రేపు ఉదయం 8గం.లకు ఏచూరి పార్దీవదేహాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు తరలించనున్నారు. ఉదయం 10గం.ల వరకు పార్టీ అగ్రనేతలు, విదేశీ ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తదితరుల సందర్శనార్ధం, ఉదయం 11గం.ల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తల కోసం అక్కడే ఉంచుతారు. సాయంత్రం 4 గం.లకు భౌతికకాయాన్ని ఏకేజీ భవన్ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement