Friday, September 6, 2024

Chhattisgarh: ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు మృతి..

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. సుక్మా జిల్లాలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోల మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. గన్ ఫైర్ తొన్లాయ్, టెట్రాయ్ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగింది.

- Advertisement -

తెల్లవారుజాము నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్‌కౌంటర్‌ను సుక్మాజిల్లా ఎస్పీ కిరణ్‌ చవాన్ ధ్రువీకరించారు. తాజా కాల్పులతో ఈ ఏడాది ఇప్పటి వరకు మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 105కు చేరింది. పరిసర ప్రాంతాల్లో నక్సలైట్ల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement