Thursday, September 19, 2024

Chennai | తిరుచిరాపల్లిలో ఆంధ్ర భ‌క్తుల‌పై దాడి..

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి రంగనాథస్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన‌ ఆంధ్రప్రదేశ్ అయ్యప్ప భక్తుల‌పై దాడి జ‌రిగింది. ఆ ఆలయ సిబ్బంది ఆంధ్ర అయ్యప్ప భక్తులపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. దీంతో రంగనాథ ఆలయంలో ఉద్రిక్తత ఏర్పడింది. దాదాపు పదుల సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఈ దాడిలో గాయపడ్డారు. దీంతో ఆలయం వెలుపల ధర్నాకు దిగారు అయ్యప్ప భక్తులు. ఇక‌, గాయపడినా భక్తులకు స్దానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీ భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement