Friday, September 20, 2024

HYD | మిలాద్ ర్యాలీలో అపశృతి.. చార్మినార్ వ‌ద్ద అగ్నిప్ర‌మాదం…

హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ దగ్గర ఆల్ ఇండియా సున్నీ యునైటెడ్ ఫోరం నిర్వహించిన మిలాద్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ర్యాలీలో ఓ యువకుడు టపాసులు కాల్చడంతో డీజే సౌండ్ సిస్టమ్ జనరేటర్‌పై నిప్పుర‌వ్వ‌లు ప‌డ్డాయి… దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement