Thursday, September 19, 2024

TG | పాఠశాలల టైమింగ్స్‌లో మార్పులు… ఉత్తర్వులు జారీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ : పాఠశాలల వేళలను మారుస్తూ తెలంగాణ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల సమయానికి అనుగుణంగా ఉన్నత పాఠశాలల్లో సమయాన్ని మార్చారు. ఇప్పటి వరకు ఉన్నత పాఠశాలల పనివేళలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉండగా… తాజాగా ఉన్నత పాఠశాల సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు మారుస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అమలులో ఉన్న పని వేళలే కొనసాగుతాయని సూచించింది. దీంతో జంట నగరాల్లో ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement