Saturday, September 21, 2024

TG | గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ టైమింగ్స్ మార్పు

తెలంగాణలో టీజీపీఎస్సీ నిర్వహించ‌నున్న‌ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల వేళల్లో మార్పులు చేశారు. ఈ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ జరగనున్న సంగతి తెలిసిందే.. కాగా, అసలు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జ‌ర‌గాల్సి ఉండ‌గా.. అరగంట ముందే ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు.

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ 2024 ఎగ్జామ్ షెడ్యూలు..

-అక్టోబర్ 21, 2024: జనరల్ ఇంగ్లిష్ (అర్హత సాధిస్తే చాలు)
-అక్టోబర్ 22, 2024: పేపర్-1 (జనరల్ ఎస్సే)
-అక్టోబర్ 23, 2024: పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ)
-అక్టోబర్ 24, 2024: పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)
-అక్టోబర్ 25, 2024: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)
-అక్టోబర్ 26, 2024: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్)
-అక్టోబర్ 27, 2024: పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ)

Advertisement

తాజా వార్తలు

Advertisement