Friday, September 20, 2024

TDP | తెలంగాణలో పార్టీ బలోపేతంపై చంద్రబాబు ఫోక‌స్

తెలంగాణలో భవిష్యత్‌లో అధికారంలోకి రావడమే లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సంద‌ర్భంగా నేడు ఎన్టీఆర్ భ‌వన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో జ‌రిగిన సమావేశంలో చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడతానని అన్నారు.

తెలంగాణలో 15 రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని.. యువతకు, బీసీలకు పెద్దపీట వేస్తామని చంద్రబాబు తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ అనంతరం టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు.

టీటీడీపీలో పాత కమిటీలను రద్దు చేస్తూ చంద్రబాబు కీల‌క‌ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన కమిటీలను రద్దు చేశారు. ఏపీ, తెలంగాణల్లో ఏకకాలంలో కొత్త కమిటీలు వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఏపీ తరహాలోనే కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రతి నెల రెండో శనివారం, ఆదివారం తెలంగాణకు రానున్నారు. పార్టీ నిర్మాణం పైనే దృష్టి సారించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement