Tuesday, September 17, 2024

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు ఫోక‌స్

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈరోజు కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జ్‌లతో టీడీపీ అధినేత భేటీ కానున్నారు. అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, గుంటూరు ఈస్ట్, పార్టీ ఇన్చార్జులతో బాబు భేటీ కానున్నారు. నేతలతో వన్ టూ వన్ మాట్లాడనున్నారు. నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలపై నేతలతో చంద్రబాబు నాయుడు సమీక్షించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement