Friday, October 18, 2024

AP: 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ…

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు వారికి పలు అంశాలపై క్లాసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని.. ఎమ్మెల్యేలకు మరోసారి స్పష్టం చేయనున్నారు.

ఇప్పటికే మద్యం షాపు యజమానులను బెదిరించిన.. పలువురు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలని ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే త్వరలో రాష్ట్రంలో జరగబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించి, ప్రస్తుత పరిస్థితులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి అడిగి తెలుసుకోనున్నారు. అలాగే దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్టీ వీక్‌గా ఉన్న ప్రాంతాల్లో పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement