Tuesday, September 17, 2024

AP: బ్లాస్ట్ బాధితుల‌కు చంద్ర‌బాబు ప‌రామ‌ర్శ‌..

అన‌కాప‌ల్లి : అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ ఆసుపత్రికి వెళ్లిన ఆయ‌న అచ్యుతాపురం సెజ్ లోని పేలుడు ఘటనలో చికిత్స పొందుతున్న‌ క్షతగాత్రులను క‌లిశారు. ఘ‌ట‌న వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన ఒక్కొక్క‌రికి కోటి రూపాయలు న‌ష్ట ప‌రిహారం ఇస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బుధవారం రియాక్టర్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 20మంది మృతిచెందారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement