Thursday, October 24, 2024

TG | సెంట్రల్‌ టెక్స్‌టైల్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ సభ్యుడిగా చామల కిరణ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్ర టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా భువనగిరి ఎంపి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీకి కేంద్ర టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి గిరిరాజు సింగ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. లోక్‌సభ నుండి 8 మంది, రాజ్యసభ నుండి నలుగురు, అలాగే ఎక్స్‌ ఎఫిషియో సభ్యులుగా ఇద్దరు సభ్యులు మొత్తం 14 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో తెలంగాణ నుంచి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డికి చోటు దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement