Sunday, September 15, 2024

Appeal – స‌మ్మె విర‌మించండి… డాక్ట‌ర్ల‌కు కేంద్ర విన‌తి..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్త నిరసన చేపడుతున్న వైద్యులు తక్షణమే సమ్మె నిలిపివేయాలని కేంద్రం కోరింది.. వైద్యుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. దేశంలో సీజనల్‌ వ్యాధులైన డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే విధుల్లో చేరాలని కోరింది.


.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement