Thursday, September 19, 2024

Bussiness – నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ….

దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ముగియడంతో భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 398 పాయింట్లు క్షీణించి 81,523, నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 24,918 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ బ్యాంకు 262 పాయింట్లు క్షీణించి 51,010 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఎస్బీఐ, విప్రో, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్స్, రిలయన్స్ వంటి హెవీ వెయిట్స్ టాప్ లూజర్లుగా నిలిచాయి. ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు టాప్ గెయినర్లుగా నిలిచాయి.

- Advertisement -

రంగాలవారీగా చూస్తే ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ఫిన్ సర్వీస్, మెటల్, రియాల్టీ, ఎనర్జీ లాభపడగా, ఎఫ్ఎంసీజీ, వినియోగ రంగాలు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement