Tuesday, September 17, 2024

Himachal Pradesh | సిమ్లాలో బ‌స్సు బోల్తా.. న‌లుగురి మృతి

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని జుబ్బల్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుబ్బల్‌లోని గిల్తాడి రోడ్డుపై హెచ్‌ఆర్‌టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం నలుగురు అక్కడికక్కడే మృతి చెండగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ కూడా ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి తెలుసుకున్న జుబ్బల్‌ తహసీల్‌ ఏరియా ఎస్‌డీఎం రాజీవ్‌ నమ్రాన్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్టీసీ బస్సు జుబ్బల్‌ మీదుగా వెళ్తుందని రాజీవ్‌ వివరించారు. బస్సు ఎలా బోల్తా పడిందో తెలియడం లేదని ఆయన అన్నారు. బస్సు బోల్తా పడడంతో స్థానికులు వెంటనే బస్సు లోపల చిక్కుకున్న వారిని రక్షించి బయటకు తీసుకుని వచ్చారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement