Friday, October 18, 2024

Pakistan : లోయలో పడిన బస్సు.. 28మంది మృతి

ప్రమాదవశాత్తు బస్సు అదుపు తప్పి లోయలో పడ్డ ఘటనలో 28మంది మృతిచెందిన ఘ‌ట‌న పాకిస్థాన్​లో చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో మ‌రో 22 మందికిపైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు టైరు పేలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు తెలిపారు. బలూచిస్థాన్​లోని టుర్బాట్​ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సు వాషుక్​ టౌక్​ సమీపంలో ప్రమాదానికి గురైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement