Friday, September 20, 2024

చెరువులోకి దూసుకెళ్లిన బస్సు – 17 మంది దుర్మరణం ..

డాకా – బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మందికిపైగా గాయపడ్డారు. ఝలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తెలిపారు.

పరిమితికి మించి ప్రయాణికులను బస్సులో ఎక్కించుకోవడం కూడా ప్రమాదానికి జరగడానికి కారణమని భావిస్తున్నారు. భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు వెళ్తున్న బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా అదుపుతప్పి చెరువులో పడిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఝలకతి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాద సమయంలో 60-70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం..

Advertisement

తాజా వార్తలు

Advertisement