Thursday, September 19, 2024

BSNL: మరో అదిరిపోయే ప్లాన్..

రూ.90 కే మూడు నెలలు వ్యాలిడిటీ
రూ.107తో కాల్స్, డేటా కూడా
సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ప్లాన్
ప్రైవేటు టెలికంలకు షాకులే షాకులు
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూఢిల్లీ : ప్రైవేటు రంగ టెలికం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల రీఛార్జ్ ప్లాన్ల రేట్లను గణనీయంగా పెంచాయి. అయితే ప్రైవేటు కంపెనీలు ఒక పక్క టారిఫ్ రేట్లు పెంచుతున్నప్పటికీ ప్రభుత్వరంగ కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రం చౌక రీఛార్జ్ ప్లాన్లను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. పాత ధరలకే కస్టమర్లకు ఆఫర్లు అందిస్తోంది. ప్రైవేటు టెలికం కంపెనీలు రీఛార్జ్ రేట్లు పెంచిన నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. కంపెనీ అందిస్తున్న ప్లాన్లను అన్వేషిస్తున్నారు. కాగా కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు చాలానే ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ బ్రహ్మండమైన ఆఫర్లను కంపెనీ అందిస్తోంది. రూ.100 కంటే రీఛార్జులు కూడా చాలానే ఉన్నాయి.

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లలో రూ.91 ప్లాన్ ఒకటిగా ఉంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంత తక్కువ ధరలో ఇతర కంపెనీలేవీ ఈ స్థాయిలో వ్యాలిడిటీని అందించడం లేదు. తక్కువ ఖర్చుతో సిమ్‌ను ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి ఈ ప్లాన్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్లాన్ కింద కాలింగ్‌కు 1 నిమిషానికి 15 పైసలు ఛార్జీ పడుతుంది. 1 ఎంబీ డేటాకు 1 పైగా, ఒక ఎస్ఎంఎస్‌కు 25 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. టాక్ టైమ్ వోచర్ లేదా డేటా వోచర్‌లతో ప్రత్యేకంగా రీఛార్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ధరల్లో ఈ కూపన్స్ అందుబాటులో ఉంటాయి.

రూ.107తో మరో ఆకర్షణీయమైన ఆఫర్..
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఆకర్షణీయైన ఆఫర్లల రూ.107 ప్లాన్ ఒకటి. పరిమితమైన డేటా అవసరమైనవారికి ఈ ప్లాన్ బాగుంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 35 రోజులుగా ఉంది. యూజర్లు 200 కాలింగ్ నిమిషాలు పొందుతారు. ఇక పరిమితంగా 35 రోజుల వ్యాలిడిటీతో 3జీబీ పరిమిత డేటా లభిస్తుంది. తక్కువ డేటా అవసరమైన వారికి మాత్రమే ఈ ప్లాన్ ఉపయోగడుతుంది. ఇది ఇలా ఉంటే 45 రోజుల‌లో వ్య‌వ‌ధిలో 25 ల‌క్ష‌ల మంది కొత్త క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు వ‌చ్చార‌ని బిఎస్ఎన్ ఎల్ ప్ర‌క‌టించింది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement