Monday, October 21, 2024

TG | ఇంజినీరింగ్ విద్యార్థి దారుణహత్య..

రాచకొండ కమీషనరేట్​ బాలాపూర్‌ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఇంజినీరింగ్‌ విద్యార్థి దారుణహత్యకు గురైన ఘటన కలకలం రేపింది. మండి 37 హోటల్లో విద్యార్థి మోండ్రు ప్రశాంత్ (21) భోజనం చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు… తీవ్ర గాయాలైన ప్రశాంత్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ప్ర‌శాంత్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ప్రశాంత్‌ ఎంవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ దాడి ఘటనలో ముగ్గురు దుండగులు ఉన్నట్లు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి వివరించారు. ఘటనపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement