Tuesday, October 22, 2024

Breaking | ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి..

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం రాంపూర్ కమలాపూర్ గ్రామాల మధ్యలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

పోలీసుల కథనం ప్రకారం.. మేడారం నుంచి భూపాలపల్లికి వస్తున్న కారు అతివేగంతో వచ్చి కమలాపూర్ గ్రామం నుంచి బయటకు వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రేగళ్ల నరేష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేగళ్ల ప్రమోద్ మృతి చెందాడు. అయితే అతి వేగంతో వచ్చిన వాహనంలో ఏదో జంతువుకు చెందిన మాంసం లభించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎస్సై ప్రసాద్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement