Friday, September 6, 2024

Bonalu – మహాకాళి అమ్మవారికి బోనం సమర్పించిన కెసిఆర్

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు.ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయనతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మహాకాళిని దర్శించుకొని బంగారు బోనం సమర్పించారు.

హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళికి బోనం సమర్పించారు. మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement