Monday, September 30, 2024

Tamil Nadu: పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు..

దేశంలో బాంబు బెదిరింపు మెయిళ్లు తరచూ అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కాగా, తాజాగా తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని మదురై ప్రాంతంలో ఉన్న కేంద్రీయ విద్యాలయం, జీవన స్కూల్‌, వేలఅమ్మాల్‌ విద్యాలయాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ రావడంతో సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ ఆయా పాఠశాలలకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. కాగా ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ తాజ్‌ వెస్ట్‌ అండ్‌ హోటల్‌ కు బాంబు బెదిరింపు కాల్‌ కలకలం రేపింది. ఇందులో రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ప్రముఖులు బస చేస్తుంటారు. ఢిల్లీలోని పలు స్కూళ్లు, ఆసుపత్రులు, విమానాశ్రయాలకు కూడా పలుమార్లు బూటకపు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement