Friday, October 18, 2024

TG | ప్రొఫెసర్ సాయి బాబా భౌతికకాయం ఆసుపత్రికి అప్పగింత

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, పౌర హక్కుల కార్యకర్త జీఎన్ సాయిబాబా(54) శనివారం రాత్రి హైదరాబాద్ నిమ్స్ లో కన్నుమూశారు. అయితే ఆయన కోరిక మేరకు ఆయ‌న‌ భౌతికకాయాన్ని ఆస్పత్రికి అప్పగిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.

సాయిబాబా భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌కు తరలించారు. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించిన అనంతరం ఆయన కోరిక మేరకు మృతదేహాన్ని ఆస్పత్రికి అప్పగిస్తామని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement