Monday, October 21, 2024

Maharashtra ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుద‌ల !

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా… 99 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ఇవాళ ప్రకటించింది. కాగా, నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల కానుంది. త్వరలోనే బీజేపీ తన తదుపరి జాబితా విడుదల చేయనుంది.

కాగా, నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను బరిలోకి దింపింది. ఇక బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భవన్‌కులే కంతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ భోకర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement