Friday, September 6, 2024

BJP | అరంగేట్రంలోనే కంగ‌నా విజయ‌భేరీ…

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ రాజకీయ అరంగేట్రంలోనే జయకేతనం ఎగురవేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన కంగన తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 72,088 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఇక విలేకరుల సమావేశంలో రనౌత్ మాట్లాడుతూ.. “మేము ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ పేరు మీద పోరాడాము. ఆయన విశ్వసనీయత, ఆయన హామీ, ప్రజల్లో ఆయనపై ఉన్న విశ్వాసం ఫలితంగానే మేము మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement