Friday, October 18, 2024

IND vs NZ | భారత్‌కు భారీ షాక్.. భారీ ఆధిక్యం దిశగా కివీస్!

బెంగళూరు వేదికగా భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో కివీస్ జట్టు పట్టు బిగించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత‌ బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో ఐదుగురు డకౌట్ కాగా, రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

కాగా, భారత్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్…. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 180/3 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు 134 పరుగుల ఆధిక్యంలో ఉంది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే (91) తృటిలో సెంచరీ మిస్ అయ్యింది. కాగా, ప్రస్తుతం క్రీజులో డారిల్ మిచెల్ (14), రచిన్ రవీంద్ర (22) ఉన్నారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement