Thursday, September 12, 2024

TG | నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటునకు భూమి పూజ…

తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విషయాన్ని వెల్లడించారు. నేటి ఉదయం 11 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవిష్కరించనున్నట్టు సీఎం ప్రకటించినట్లుగానే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాగా, ఈ భూమిపూజ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement