Saturday, October 19, 2024

Jharkhand | రాంచీలో రాహుల్… భట్టి సాదర ఆహ్వానం

ఏఐసీసీ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క భేటీ అయ్యిరు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడిగా భట్టివిక్రమార్క ఉన్నారు. దీంతో భ‌ట్టి ప్రస్తుతం రాంచీలో మకాం వేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు రాంచీ చేరుకున్నారు. రాహుల్ గాంధీని భట్టివిక్రమార్క శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఇప్పటికే పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 81 అసెంబ్లీ స్థానాలకు గాను 70 చోట్ల జేఎంఎం, కాంగ్రెస్ పోటీ చేయనున్నాయి. మిగిలిన 11 స్థానాల్లో ఆర్జేడీ, వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. ఝార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశాల్లో పోలింగ్ జరగనుంది. అదే నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement