Monday, September 16, 2024

Lok Sabha | లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్

ఒడిశాలోని కటక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన సీనియర్ పార్లమెంటేరియన్ భర్తిహరి మహతాబ్ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సమీప బీజేడీ అభ్యర్థి సంత్రుప్ట్ మిశ్రాపై 57 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1998 నుంచి 2019 వరకు బీజేడీ తరపున వరుసగా గెలుస్తూ వచ్చారు. ఈసారి బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అతను 2017లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును గెలుచుకున్నాడు. అతను వరుసగా 2017, 2018, 2019లో సంసద్ రత్న అవార్డును గెలుచుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement