భారతరత్న అవార్డులను ఇవాళ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రధానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇటీవల భారతరత్న పొందిన వారు అవార్డులను స్వీకరించారు.
- Advertisement -
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్.. అలాగే, ఎమ్ఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ను మరణానంతరం భారతరత్న అవార్డు వరించింది. పీవీ నరసింహరావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు.. చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ సింగ్ అవార్డును అందుకున్నారు.