రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ ముంబయిలో ముగింపు కానుంది. ఈ సందర్భంగా ఎన్నికల శంఖరావం పూరించనుంది. విపక్ష కూటమి బలాన్ని చాటేందుకు రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభనే వేదికగా చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది.
- Advertisement -
ఈ నేపథ్యంలో ఇవాళ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముంబయిలో ముగుస్తుండగా.. ముగింపు సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సభకు ప్రాంతీయ పార్టీల దిగ్గజ నేతలను ఆహ్వానించింది. 6,700 కిలోమీటర్లపాటు సాగిన రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముంబయిలో ముగియనున్న వేళ దానినే ఎన్నికల శంఖారావ సభకు వినియోగించుకోవాలని విపక్ష ఇండియా కూటమి నేతలు భావించారు.