Friday, October 18, 2024

Paris Olympics | భారత అథ్లెట్లకు బీసీసీఐ 8.5 కోట్ల ఆర్థిక సాయం..

పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత అథ్లెట్లకు బీసీసీఐ ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘానికి రూ.8.5 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జెషా ప్రకటించారు. కాగా, పారిస్ ఒలింపిక్స్ ఈ నెల 24న (జూలై) ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్ తరఫున పాల్గొననున్న అథ్లెట్లకు జైషా శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం గర్వపడేలా స‌త్తా చాటాల‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement