Wednesday, October 9, 2024

TG | రాజ్ భవన్ లో ఘ‌నంగా బతుకమ్మ సంబరాలు…

హైదరాబాద్ రాజ్‌భవన్‌లో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, రాష్ట్రీ సీఎస్ శాంతి కుమారి సహా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయన సతీమణి సుధా దేవ్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడపడుచులకు గవర్నర్ దంపతులు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సుధా దేవ్ వర్మ బతుకమ్మ సంబరాలలో రాజ్ భవన్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆచారవ్యవహారాలను అనుసరించారు. బతుకమ్మను తీసుకుని రాజ్ భవన్ ప్రధాన భవనం ఎదుట ఉన్న ఆవరణలోకి వచ్చిన ఆమె.. అక్కడే రాజ్ భవన్ సిబ్బంది కుటుంబాలతో కలిసి ఆడిపాడారు. అనంత‌రం మహిళలు అందరితో కలిసి వెళ్లి అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక నీళ్ల తొట్టిలో బతుకమ్మను విడిచిపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement