Friday, September 20, 2024

Bangladesh – హోట‌ల్ కు నిప్పు… 24 మంది స‌జీవ ద‌హ‌నం

బంగ్లాదేశ్‌లో విధ్వంసం కొనసాగుతోంది. ప్ర‌ధాని షేక్ హాసీనా ప‌ద‌వికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయినా ఆందోళ‌న‌కారులు శాంతించ‌డం లేదు.. ఆమె పార్టీ నేత‌ల‌పై దాడులు కొన‌సాగిస్తున్నారు.. ఇప్ప‌టికే ఆ పార్టీ ఎంపి , క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఇంటిని త‌గుల బెట్టిన విధ్వంస‌కారులు తాజాగా జషోర్ జిల్లాలో ఓ హోటల్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమ‌య్యారు.. మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు ఉన్నాడని లోకల్ మీడియా వెల్ల‌డించింది. ఆందోళనకారులు నిప్పు పెట్టిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందినదిగా పోలీసులు పేర్కొన్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement