Friday, October 18, 2024

Bangladesh: కాళీ ఆల‌యంలో కిరీటం చోరి

2021లో ప్ర‌ధాని మోడీ బ‌హుమ‌తిగా ఇచ్చిన సిల్వ‌ర్ క్రౌన్

బంగ్లాదేశ్ సత్‌ఖిరాలోని జెషోరేశ్వరి ఆలయానికి మార్చి 2021లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కానుకగా ఇచ్చిన కాళీ దేవి కిరీటం చోరీకి గురైంది. గ‌త రాత్రి ఆలయ పూజారి పూజలు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో కిరీటం పోయినట్లుగా గుర్తించారు .
ఆలయాన్ని తరతరాలుగా చూసుకుంటున్న కుటుంబానికి చెందిన జ్యోతి ఛటోపాధ్యాయ మాట్లాడుతూ.. ఈ కిరీటాన్ని వెండితో తయారు చేశారని, బంగారు పూత పూసినట్లు ఆమె వివరించారు. ఈ కిరీటం సాంస్కృతికంగా, మతపరంగా ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement