Tuesday, September 17, 2024

Bangladesh – అగని హింసాకాండ … 24 గంటలలో 100 మంది మృతి

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – డాకా – బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ను వ్య‌తిరేకిస్తూ పై కొన‌సాగుతున్న ఆందోళ‌న‌ల‌ను తారాస్థాయికి చేరాయి..గ‌డిచిన 24 గంల‌లో చెల‌రేగిన హింసాకాండ‌లో 100 మందికి పైగా మరణించారు. ఈ హింసాకాండలో ఓ హిందూ కౌన్సిలర్ కూడా చనిపోయాడు. రంగ్‌పూర్ సిటీ కౌన్సిలర్ హరధన్ రాయ్ హర ఇంటిపై ఆందోళనకారులు దాడి చేసి హత్య చేశారు. హిందువుల దేవాలయాలు, వారి ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదికలలో పేర్కొన్నారు.
నిరసనకారులు ఇస్కాన్, కాళీ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారు.. భక్తులపై దాడి చేశారు. ఆ తర్వాత ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోవాల్సి వచ్చింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన హింసాకాండకు సంబంధించిన రాజకీయ, మతపరమైన అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. వివిధ చోట్ల ప్రభుత్వ మద్దతుదారులు, ప్రతిపక్షాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

పొరుగు దేశంలో జరుగుతున్న తాజా హింసాత్మక సంఘటనల దృష్ట్యా బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న తమ పౌరులందరూ జాగ్రత్తలు పాటించాలని.. వారి కదలికలను పరిమితం చేయాలని భారతదేశం సూచించింది. తదుపరి ఆదేశాల వరకు బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దని భారత్ తన పౌరులను కోరుతూ కొత్త సలహాను జారీ చేసింది. బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల మధ్య ఆదివారం జరిగిన ఘర్షణల్లో 14 మంది పోలీసులతో సహా కనీసం 97 మంది మరణించారని ఢాకా నుండి వచ్చిన నివేదికలు తెలిపాయి. అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు.

- Advertisement -

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ‘ఫేస్‌బుక్’, ‘మెసెంజర్’, ‘వాట్సాప్’, ‘ఇన్‌స్టాగ్రామ్’లను మూసివేయాలని ప్రభుత్వ సంస్థలు ఆదేశించాయి. 4G ఇంటర్నెట్‌ను మూసివేయాలని మొబైల్ ప్రొవైడర్‌లను ఆదేశించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడుతున్న వారు విద్యార్థులు కాదని, ఉగ్రవాదులేనని, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రధాని హసీనా ప్రజలను కోరారు. నిరసనల కారణంగా ఢాకాలోని చాలా దుకాణాలు, మాల్స్ మూతబడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement