Tuesday, October 8, 2024

KNR | రాజన్న ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు !

తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి ఆలయానికి వచ్చిన బండి సంజయ్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు.

ఆ త‌రువాత‌ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement