అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన అనంతరం మొదటి శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
రామనవమి వేళ అయోధ్యలో వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో బాల రాముడు గుడి నుంచి బయటకు రావడం కనిపించింది.
- Advertisement -
మొదటగా అవాక్కైన భక్తులు తర్వాత తేరుకొని బాలరాముడిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. అతను ఓ సాధారణ బాలుడి అని.. రామ్ లల్లా వేషధారణలో ఉన్నాడని గ్రహించారు. అయినప్పటికి రామ్ లల్లా విగ్రహాన్ని పోలినట్లే ఉండటంతో అతనితో ఫోటోలు దిగేందుకు అక్కడి వారు ఎగబడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రాముడి వేషంలో ఉన్న బాలుడు అచ్చం రామ్ లల్లా మాదిరిగా కనిపించడం విశేషం.